నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగియడంతో.. అధికారులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఓటింగ్ జరుగుతుండటంతో ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటరు పట్టం కట్టాడనేది నవంబర్ 14వ తేదీన వెల్లడి కానుంది.
ఎలక్షన్స్ లేకుంటే సినిమా వాళ్ల మీద కేసులు పెడతారని కేటీఆర్ విమర్శించారు. అదే ఎలక్షన్స్ వచ్చాయంటే సినిమా వాళ్ళ కాళ్ళ మీద పడతారంటూ కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిని ఈ సందర్భంగా కేటీఆర్ ఎండగట్టారు.
బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన కాంగ్రెస్ పార్టీదే విజయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు. మాగంటి గోపినాథ్ తల్లి ఆవేదనకు కేటీఆర్ జవాబు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే గోపినాథ్ కుమారుడు సంధించిన ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పాలని కేటీఆర్కు సూచించారు. నవీన్ యాదవ్పై ఒక్క కేసును బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చూపిస్తే తాను దేనికైనా సిద్ధమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత అన్న కుమార్తె వివాహం శనివారం (నవంబర్ 8వ తేదీ) హైదరాబాద్లో జరిగిందన్నారు. దీనికి ఆయన భార్యతో కలిసి ఎందుకు వెళ్ల లేదో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమరం ముగింపు దశకు చేరింది. మంగళవారం జరిగే పోలింగ్పై ఇన్చార్జీలు, స్థానికంగా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ రోజున పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేలా..
కేటీఆర్తో కలిసి గోపీనాథ్ ఆస్తుల్లో వాటాకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అందుకే గోపీనాథ్ మరణం మిస్టరీపై, ఆస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించడం లేదని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్రెడ్డి.
రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క చిన్న రోడ్డు అయినా వేశారా అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నల వర్షం కురిపించారు. . కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే మళ్లీ ఇంకెంత సమయం పడుతుందోనని విమర్శించారు మాజీ మంత్రి హరీశ్రావు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఈరోజుతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జోరుగా ఇవాళ ప్రచారం చేయనున్నాయి.