లాలూతో సమావేశానంతరం గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ, బిహార్లో 243 సీట్లు ఉన్నాయని, 5 నుంచి 10 సీట్లలో స్నేహపూర్వక పోటీ పెద్ద విషయం కాదని అన్నారు. 'ఇండియా' కూటమి పూర్తి ఐక్యమత్యం, పూర్తి శక్తిసామర్థ్యాలతో పోటీకి సిద్ధంగా ఉందన్నారు.
జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్స్)లకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పిస్తామని, రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ గా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తేజస్వి యాదవ్ వాగ్దానం చేశారు.
శ్వేతాసుమన్ 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని చౌందౌలి జిల్లావాసిగా నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. అయితే 2025 ఎన్నికల్లో బిహార్ నివాసిగా పేర్కొన్నారు.
అక్టోబర్ 6న ఎన్నికల ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకూ రూ.71.32 కోట్లు విలువచేసే నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, కీలకమైన మెటల్స్, ఇతర ఉచితాలను ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది.
బిహార్లో గత ప్రభుత్వాల హయాంలో శాంతిభద్రతులు, విద్య, మౌలిక వసతులు దయనీయంగా ఉండేవని, తమ నాయకత్వంలో బీహార్లో గణనీయంగా మార్పులు చోటుచేసుకున్నాయని నితీష్ కుమార్ చెప్పారు. మెరుగైన రోడ్లు, విద్యుత్, శాంతిభద్రతలు, ప్రజల మధ్య సామరస్యం పాదుకొల్పామని అన్నారు.