బీటెక్ పూర్తి చేసిన యువతకు ఇండియన్ ఆర్మీలో అధికారి అయ్యే సువర్ణావకాశం వచ్చింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC-Tech) కింద 350 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
అనాథ విద్యార్థులు, కొవిడ్-19లో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఏఐసీటీఈ స్వనాథ్ స్కాలర్షిప్లను అందజేస్తోంది.
ఏపీ ఎప్సెట్ ఫలితాలు (AP EAPCET 2026) వెల్లడి కావడంతో అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తొలి విడత ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్ను తాజాగా విడుదల చేశారు.
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు పరీక్షలకు పునాది వేసే ఈ దశలో కొత్త భాషను ప్రవేశపెట్టడం విద్యార్థులపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని వ్యాఖ్యానించింది.
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా మూడో భాషను తప్పనిసరి అర్హతా సబ్జెక్టుగా ప్రకటించింది.
జేఎన్టీయూలో ఆరువేల సర్టిఫికెట్ల మిస్సింగ్ వ్యవహారాన్ని అధికారులు తేలికగా తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
యూనివర్సిటీలో వైస్చాన్స్లర్ తర్వాత అత్యంత కీలకమైన పదవి రిజిస్ట్రార్. అటువంటి వ్యక్తి లేకుండానే జేఎన్టీయూలో పాలన సాగిపోతోంది.
ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) గుడ్న్యూస్ చెప్పింది. అసిస్టెంట్ ఇంజినీర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులతో కలిపి మొత్తం 114 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇండియాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో నేపాల్ దేశానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారని కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ‘AISHE సర్వే’లో తేలింది.