CM Chandrababu Naidu: రాజధాని అమరావతికి రైతులు పైసా తీసుకోకుండా రూ.33వేల ఎకరాలు ఇచ్చారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి ఇవ్వడం ప్రపంచంలోనే ఒక చరిత్ర అని అభివర్ణించారు. ఇప్పుడు వచ్చే ఆదాయనికంటే ఎక్కువ ఇస్తామని రైతులకు చెప్పామని సీఎం చంద్రబాబు తెలిపారు.
CM Chandrababu: తెలుగువారి చరిత్ర ఉన్నంతవరకు పొట్టి శ్రీరాములు గుర్తుంటారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లాకు ఆయన పేరును కూడా తమ ప్రభుత్వంలోనే పెట్టామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
నెల్లూరు జీఆర్పీ సీఐ భుజంగరావుపై అవినీతి ఆరోపణలు నిర్ణారణ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు అతనిని వీఆర్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. సీఐ అక్రమాలపై గతంలో ఆధారాలతో సహా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేసింది. ఏబీఎన్ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు.. విచారణ చేపట్టారు.
నెల్లూరు జిల్లా: వెంకటగిరి పోలీస్ సర్కిల్ పరిధిలో నలుగురు బాలికలు, ఓ మహిళ మిస్సింగ్ కావడం కలకలం రేపింది. వారు ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందిన వారి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Nara Lokesh: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొత్త వరవడిని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సృష్టించారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
Anam Ramanarayana Reddy: ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్పై వైసీపీ నేతలు పేపర్లు చించి వేసి అగౌరవపరిచారని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పారు. జగన్ స్వతహాగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హితవు పలికారు.
Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కాకాణి అక్రమ భాగోతాలు బయటకు వస్తున్నాయి.
MP Kalisetti Appalanaidu: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శలు చేశారు. జగన్ ఆయన టీం వ్యవస్థను మొత్తం నాశనం చేశారని ధ్వజమెత్తారు.
ఉమ్మాడి నెల్లూరు జిల్లా: ఓజిలి మండలం, చుట్టూగుంట జాతీయ రహదారి సమీపంలో అఘోరి హల్ చల్ చేసింది. రెండు లారీలలో ఎద్దులను తీసుకు వెళుతున్న రైతులను ఆపి కత్తులు, సూలాలతో భయబ్రాంతులకు గురి చేసింది.
Narayana: గత వైసీపీ ప్రభుత్వంలో కక్షసాధింపులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.