Home » Andhra Pradesh » Guntur
హైదరాబాద్లో బసవతారకం ఆస్పత్రి ఇంకా విస్తరణ జరుగుతుందని ఆ హాస్పిటల్ చైర్మన్, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అమరావతిలో కూడా బసవతారకం ఆస్పత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఆదరణ పథకంలో భాగంగా రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని ఏపీ మంత్రి సవిత ప్రకటించారు. గతంలో ఆదరణ పథకంలో వస్తువులు ఇచ్చామని.. ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా బీసీ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో క్రీడా రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని యువజన సర్వీసులు, క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ఐక్యతను కాపాడేందుకు మంత్రులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
బీచ్ షాక్స్ వద్ద పర్యాటకులకు పటిష్టమైన భద్రత కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. రాష్ట్రంలోని 20 బీచ్లకు అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని అన్నారు.
డాక్టర్ దిలీప్ కిలారు తాను రచించిన పుస్తకాన్ని తాజాగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహూకరించారు. ఈ సందర్భంగా పుస్తకంలోని అంశాలను పరిశీలించిన సీఎం.. రచయిత కృషిని అభినందించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ సానా సతీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పెట్టిన సభ.. కాపు ఆత్మీయ సభ కాదని.. రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని విమర్శించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఓటమి నిరాశ, నిస్పృహలతో, ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవాలని గొడ్డలి పార్టీ చూస్తోందని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మరికాసేపట్లో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.
ఏపీలో క్రికెట్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివనాథ్(చిన్ని) వ్యాఖ్యానించారు. ఐపీఎల్ తరహాలో తీసుకెళ్లడానికి ప్రభుత్వం, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ ఏర్పాట్లు చేస్తున్నాయని పేర్కొన్నారు.