Home » Andhra Pradesh » Guntur
ఏపీ వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పలు కీలక శాఖలకు ఇన్ఛార్జ్లను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు వారికి బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
విద్యుత్ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సంస్థలకు పెను భారంగా మారిన అప్పులను తగ్గించి.. ఛార్జీలు పెంచకుండా అప్పులు తీర్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఏపీ పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో గదుల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, 11 అనే సంఖ్యకు మధ్య ఉన్న విచిత్రమైన సంబంధం ఈ ఘటనతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం, ఏపీలో భారీ సినీ ప్రాజెక్టులకు పునాది పడబోతుందనే సంకేతాలను ఇస్తోంది.
రాజధాని అమరావతిలోని ప్రాంతం రాయపూడిలో నిన్న(సోమవారం) రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు(మంగళవారం) రివ్యూ నిర్వహించారు. రాయపూడిలో హెచ్వోడీ టవర్ల నిర్మాణం వద్ద మెగా సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు రాత్రి దగ్ధమైన ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకి అధికారులు వివరించారు.
జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాల్లో ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) పేదలకు వివిధ రకాల సేవలు అందిస్తోందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్డీటీకి విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్య పరిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీ కార్యకలాపాలు ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఆర్డీటీ సేవలు ఆగిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చర్చలు జరిపారు.
రాజధాని అమరావతిపై ఎవరు కుట్రలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అమరావతిలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం.. అది కూడా ఒకే తరహాలో జరుగుతుండటంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.