Home » Andhra Pradesh » Guntur
సూపర్ సిక్స్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని గత ఆగస్టు నెల నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మహిళకూ ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. ఈ మేరకు ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకూ ఈ పథకానికైన ఖర్చును ఏపీఎస్ ఆర్టీసీకి చెల్లిస్తూ కూటమి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
కృష్ణా జిల్లా పెనమలూరుకు మండలం చోడవరం గ్రామానికి చెందిన మాలపాటి భాస్కరరెడ్డి లండన్లో ఉంటూ మూడేళ్లుగా సోషల్ మీడియాలో అత్యంత నీచంగా పోస్టులు పెడుతున్నాడు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అతి త్వరలో జైలుకు వెళ్లక తప్పదని లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యాల రావు స్పష్టం చేశారు.
రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను చేసిన తప్పులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.
పేదలకు ఇళ్లు ఇవ్వకుండా జగన్ హయాంలో రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసి చేతులు దులుపుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని పేదలకి కూడా తమ ప్రభుత్వం సాయం చేస్తోందని భరోసా కల్పించారు.
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయి ప్రవర్తించారు. రోడ్డుపై పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు.
మొంథా తుపాన్ వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్నికేంద్ర మంత్రి చౌహన్కు సీఎం చంద్రబాబు వివరించారు. ఇక మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సహకారించాలని ఆయనకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని.. ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూని అప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని తెలిపారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు.
గుంటూరు జిల్లాలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి పనులని ప్రారంభించారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు. దేశానికి ఆయన చేసిన సేవలను చంద్రబాబు, లోకేష్ కొనియాడారు.