నేపాల్లో భీకర ఆకస్మిక వరదలు..
ABN, Publish Date - Aug 27 , 2026 | 09:10 AM
హిమాలయాల ఒడిలో ఉన్న నేపాలీ గ్రామాలను క్షణాల్లోనే శ్మశాన నిశ్శబ్దంలోకి నెట్టేసిన మహా విపత్తు ఒకటి చోటుచేసుకుంది. కనీవినీ ఎరుగని జల ప్రళయం అటు చైనాలోని టిబెట్, ఇటు నేపాల్ సరిహద్దు గ్రామాలు, పట్టణాలను తుడిచిపెట్టేసింది.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్లో మహా విషాదం చోటుచేసుకుంది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో వరద బీభత్సం సృష్టించింది. భోటే కోషి నది ఉప్పొంగడంతో అనేక జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. ఈ ఘటనలో 157 మంది జల సమాధి కాగా.. 1000 మందికిపైగా గల్లంతయ్యారు. ఇందులో 403 మంది విదేశీయ పర్యాటకులు ఉన్నారు. నిన్న(బుధవారం) ఉదయం టిబెట్లోని గోసాయిన్ కుండ ప్రాంతంలో భూకంపం సంభవించి.. ఆ ప్రభావంతో భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. పెను విపత్తుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రపంచవ్యాప్తంగా యూఎస్ వీసా అప్పాయింట్మెంట్స్ నిలిపివేత
నేపాల్లో ఆకస్మిక వరదలు.. 133 మంది భారతీయ యాత్రికుల గల్లంతు..
Updated at - Aug 27 , 2026 | 09:14 AM