4 రోజులు 45 భేటీలు.. లోకేశ్ దావోస్ టూర్ సక్సెస్

ABN, Publish Date - Jan 24 , 2026 | 09:38 AM

మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా 45 కీలక సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు.

అమరావతి, జనవరి 24: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) స్విట్జర్లాండ్‌‌లోని దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సు పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటనలో లోకేశ్ అత్యంత చురుకుగా వ్యవహరించారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో మంత్రి లోకేశ్ ఏకంగా 45 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అపారమైన వనరులు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలు, పారిశ్రామిక అనుకూలతలను వారికి వివరించారు.


ఇవి కూడా చదవండి...

డ్రోన్ల ఎగరవేతపై ఆంక్షలు

నేటి నుంచి షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్‌

Read Latest AP News And Telugu News

Updated at - Jan 24 , 2026 | 09:38 AM