బ్రహ్మణి స్టీల్స్ భూములు వెనక్కి.!

ABN, Publish Date - Jul 10 , 2026 | 08:42 AM

కడప జిల్లాను స్టీల్‌ సిటీగా మార్చేస్తామన్నారు. బ్రహ్మణి స్టీల్స్‌ అధినేత అయిన తన సన్నిహితుడు గాలి జనార్దన్‌రెడ్డికి నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పది వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కట్టబెట్టారు. ఆయనేమో..

కడప జిల్లాను స్టీల్‌ సిటీగా మార్చేస్తామన్నారు. బ్రహ్మణి స్టీల్స్‌ అధినేత అయిన తన సన్నిహితుడు గాలి జనార్దన్‌రెడ్డికి నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పది వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కట్టబెట్టారు. ఆయనేమో స్టీల్‌ ప్లాంట్‌ పనులే చేపట్టకుండా ఆ భూములను ఎంచక్కా బ్యాంకులో తనఖాపెట్టి వందల కోట్ల రుణం తెచ్చుకున్నారు. తర్వాత విమానాశ్రయం కూడా కడతామని 3 వేల ఎకరాలకు పైనే తీసుకున్నారు. ప్రహరీ నిర్మాణం తప్ప ఏమీ చేయలేదు. వైఎస్‌ మరణం తర్వాత ఆ బండారం బయటపడింది. ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని 2013లోనే అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గాలి హైకోర్టుకు వెళ్లి ఇప్పటివరకూ లాక్కొచ్చారు. ఆయన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో తాజాగా ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 10 , 2026 | 08:42 AM