షాబాద్ హత్యలపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం
ABN , Publish Date - Jul 11 , 2026 | 01:43 PM
షాబాద్ హత్యల ఘటనపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క.. హత్య ఘటనపై కఠిన చర్యలకు ఆదేశించారు.
హైదరాబాద్, జులై 11: రంగారెడ్డి జిల్లా షాబాద్, దైవాలగూడలో జరిగిన ఘోర హత్యల ఘటనపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్న మంత్రి.. హత్య ఘటనపై కఠిన చర్యలు ఆదేశించారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే మంత్రి సీతక్క రాజస్థాన్ నుంచే సంబంధిత పోలీస్ కమిషనర్తో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని, కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మంత్రి.. వారికి తక్షణ సహాయం అందించాలని సూచించారు. మహిళలు, పిల్లల భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, నేరస్థులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఆమె హెచ్చరించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకూ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేస్తూ, బాధిత కుటుంబ సభ్యులకు మానసిక, సామాజిక తోడ్పాటు కల్పించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
అంతరిక్షంలోకి వజ్రాన్ని పంపించనున్న భారతీయ కంపెనీ!
మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్
For More Viral News And Telugu News