Share News

లంచం అడిగిన ఆర్టీసీ అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్

ABN , Publish Date - May 01 , 2026 | 11:31 AM

ఆర్టీసీ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ను కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో కొట్టడం సంచలనం రేపింది. టికెట్‌ లేకుండా బస్సులో ప్రయాణించిన వ్యక్తితో పాటు కండక్టర్‌ను ఆర్టీసీ అధికారి లంచం అడగటంతో ఈ ఘటన జరిగింది.

లంచం అడిగిన ఆర్టీసీ అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్
Sangareddy district

సంగారెడ్డి జిల్లా, మే 1: ఆర్టీసీ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ను కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో కొట్టి దాడి చేశారు. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద టికెట్ తనిఖీ చేసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని చెకింగ్ అధికారి గుర్తించారు. ప్రయాణికుడితో పాటు కండక్టర్‌పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అధికారి తీరుపై కండక్టర్‌తో పాటు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


టికెట్ ఇన్‌స్పెక్టర్ వాహనాన్ని రోడ్డుపైనే ఆపి వాగ్వాదానికి దిగారు. వాదన తీవ్రరూపం దాల్చడంతో అధికారిపై కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.


ఇవి కూడా చదవండి...

ఏపీ వ్యాప్తంగా జోరుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

సంపదను సృష్టిస్తున్న కార్మికుల కష్టం, త్యాగాలు అమూల్యమైనవి: కేసీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 01 , 2026 | 12:25 PM