మహబూబాబాద్లో దారుణం.. నాటు బాంబును కొరికి కుక్క మృతి
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:16 AM
మహబూబాబాద్ జిల్లాలో నాటు బాంబు కలకలం రేపింది. నెల్లికుదురు మండలం పడమటి చెరువులో నాటు బాంబును ఓ కుక్క కొరకడంతో అది పేలిపోయింది. ఈ ఘటనలో కుక్క అక్కడికక్కడే మృతి చెందగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మహబూబాబాద్, సెప్టెంబర్ 5: జిల్లాలో నాటు బాంబు కలకలం స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. నెల్లికుదురు మండలం పడమటి చెరువు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు దాచినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న ఓ కుక్క.. బాంబును కొరకడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జనసంచారం ఉండే ప్రాంతంలో నాటు బాంబు లభించడం కలకలం రేపింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు.
నాటు బాంబు అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు అమర్చారు? ఏదైనా లక్ష్యంతోనే దానిని అక్కడ ఉంచారా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు పదార్థాల తయారీ.. వినియోగానికి సంబంధించిన అంశాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలంలో మరేదైనా పేలుడు పదార్థం ఉందా అనే అనుమానంతో పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నాటు బాంబు కారణంగా కుక్క మృతి చెందిన నేపథ్యంలో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కూకట్పల్లి రైతుబజార్లో నేటి ధరల వివరాలు...
Read Latest AP News And Telangana News And International News And Telugu News