అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదు: సీఈవో
ABN , Publish Date - Aug 19 , 2026 | 08:38 PM
అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదని ఉన్నతాధికారులకు తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎన్నిక సంఘం కార్యాలయంలో ఎస్ఐఆర్(SIR)-2026పై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, ఆగస్టు 19: అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదని ఉన్నతాధికారులకు తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎన్నిక సంఘం కార్యాలయంలో ఎస్ఐఆర్(SIR)-2026పై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓలు, ఈఆర్ఓలతో సీఈవో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని వారిని ఆదేశించారు. అనామలీస్, నో- మ్యాపింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
క్లెయిమ్స్, అభ్యంతరాలను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణలు చేపట్టాలని తెలిపారు. ASDD జాబితాలోని కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని వారికి వివరించారు ఫారం 6, 6A, 7, 8పై క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం చేయ్యాలన్నారు. ఓటర్లకు నోటీసుల వివరాలు బీఎల్వోలు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నో- మ్యాపింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని వారికి సీఈవో సుదర్శన్ రెడ్డి వివరించారు.
ఇవి కూడా చదవండి..
కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్
తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్
For More TG News And Telugu News