సాయంకాలం.. సాగరతీరం
ABN , Publish Date - Aug 11 , 2026 | 07:59 AM
వరుణయాగంలో పాల్గొనేందుకు సోమవారం నాగార్జునసాగర్కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన సతీమణి గీతారెడ్డి దంపతులు.. గత స్మృతులను నెమరువేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల తొలి పరిచయం నాగార్జునసాగర్లోనే జరిగింది.
ఫొటోలో సీఎం రేవంత్, గీత దంపతులు హాయిగా చిందిస్తున్న నవ్వుల వెనుక వారికి ఎన్నో మధుర స్మృతులున్నాయ్! పైన ఫొటోలో కనిపిస్తున్న వారి బ్లాక్ అండ్ వైట్ ఫొటో తాలుకు ఆ జ్ఞాపకాల రంగుల ధగధగలకు హరివిల్లూ చిన్నబోతుందేమో! ఇంతకీ ఏమా జ్ఞాపకాలు.. ఏమిటా కథ?
నాడు ప్రేమికులుగా.. నేడు సీఎం దంపతులుగా..
వరుణయాగంలో పాల్గొనేందుకు సోమవారం నాగార్జునసాగర్కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన సతీమణి గీతారెడ్డి దంపతులు.. గత స్మృతులను నెమరువేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల తొలి పరిచయం నాగార్జునసాగర్లోనే జరిగింది. సరిగ్గా 34 ఏళ్ల క్రితం వీరిద్దరు నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద అనుకోకుండా కలుసుకున్నారు. ఆనాటి పరిచయం ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్లి జీవిత భాగస్వాములయ్యారు. దీంతో నాటి మధుర స్మృతులను గుర్తుచేసుకుంటూ.. ఆనాడు ఫొటో దిగిన నాగార్జునసాగర్లో సోమవారం మళ్లీ ఫొటో దిగారు. దీంతో ప్రేమికులుగా ఆనాడు దిగిన ఫొటోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ‘ఇది కేవలం ఫొటో మాత్రమే కాదు.. ఓ ఇద్దరి ప్రేమకథకు సాక్ష్యం’ అంటూ చేసిన కామెంట్ వైరల్గా మారింది.
ఇవి కూడా చదవండి
నిమ్స్లో పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు