Hyderabad: స్వామి వివేకానంద ఎక్స్లెన్సీ అవార్డుకు బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపిక
ABN , Publish Date - Jan 09 , 2026 | 08:20 AM
స్వామి వివేకానంద ఎక్స్లెన్సీ అవార్డుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ఎంపికయ్యారు. ఈనెల 11వతేదీన ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు(BJP State President N. Ramchander Rao).. స్వామి వివేకానంద ఎక్స్లెన్సీ అవార్డుకు ఎంపికయ్యారని తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్నారాయణ ముదిరాజ్ తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని 2026 గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 11న తార్నాక(Tarnaka)లోని రాంచందర్రావు నివాసంలో ఈ అవార్డు, శాలువా, పూలబోకే, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేయ నున్నట్లు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి.
ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్
శాప్కు 60.76 కోట్లు.. కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు
Read Latest Telangana News and National News
