ముంబైపై విజయంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది: కోహ్లీ
ABN , Publish Date - Jun 01 , 2026 | 07:40 AM
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని వరుసగా రెండోసారి ముద్దాడింది. విజయానంతరం ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. లీగ్ దశలో కాస్త తడబడినా.. ముంబై ఇండియన్స్పై ఉత్కంఠపోరులో విజయం సాధించడం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని అన్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని వరుసగా రెండోసారి ముద్దాడింది. ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఛేజింగ్ మాస్టర్గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆఖరి దాకా నిలిచి ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం కింగ్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. లీగ్ దశలో కాస్త తడబడినా.. ముంబై ఇండియన్స్పై ఉత్కంఠపోరులో విజయం సాధించడం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని అన్నాడు.
ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'గతేడాది ఉన్నంత ఒత్తిడి ఈసారి లేదని నేను మా జట్టులోని ఆటగాళ్లతో అన్నాను. మా టీమ్లో ఎలాంటి ప్రతిభ ఉందో మాకు బాగా తెలుసు. మేము అందరికంటే ముందే ఫైనల్కు చేరడానికి ఒక బలమైన కారణం ఉంది. మేము సహజసిద్ధమైన క్రికెట్ను నమ్ముకుని, మా ప్రణాళికను సరిగ్గా అమలు చేస్తే.. ఈ టోర్నమెంట్లోనే అత్యుత్తమ జట్టుగా నిలుస్తుందని భావించాము. గ్రూప్ స్టేజ్లో మేం అంత బాగా రాణించడానికి కారణం ఇదే' అని విరాట్ వెల్లడించాడు.
'మా ప్లేయర్ల నైపుణ్యాలు, వారిలోని పరిణతి , ఒత్తిడిని తట్టుకునే మానసిక స్థిరత్వం ఫైనల్ మ్యాచ్లో మరోసారి మైదానంలో స్పష్టంగా కనిపించాయి. గతంలో ఓ మ్యాచ్ ఓడిపోయాక ముంబై ఇండియన్స్పై చాలా క్లోజ్ మ్యాచ్లో గెలిచాం. ఆ ఉత్కంఠ పోరులో గెలిచిన తర్వాత మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఆ తర్వాత కేకేఆర్పై భారీ విజయాన్ని నమోదు చేశాం. టేబుల్ టాపర్స్గా నిలిచి ఇప్పుడు మళ్లీ టైటిల్ అందుకున్నాం. మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించగల ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. మా జట్టులో ఎంతో మంది విభిన్న ఆటగాళ్లకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు రావడమే దీనికి నిదర్శనం' అని కోహ్లీ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
టైటిల్తో పాటు ఆర్సీబీ ఖాతాలో అరుదైన రికార్డ్
ఆర్సీబీ ధురంధర్.. హ్యాపీ బర్త్డే కెప్టెన్ రజత్ పాటీదార్!