Home » Royal Challengers Bangalore
ఐపీఎల్ 2026 విజయం తర్వాత విరాట్ కోహ్లీ కొత్త లుక్లో కనిపించాడు. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. వైరలైన ఫోటోల్లో కొత్త హెయిర్ స్టైల్తో కోహ్లీ ఆకట్టుకుంటున్నాడు.
ఐపీఎల్ 2026లో ఆర్సీబీని విజేతగా నిలబెట్టిన ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2026 సీజన్ టైటిల్ అందుకున్న కొన్ని రోజులకే కెప్టెన్గా అతనికి ఘోర పరాజయం ఎదురైంది.
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ రెండు ఐపీఎల్ టైటిళ్లు అందించినా తగిన గుర్తింపు దక్కలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అన్నాడు. విరాట్ కోహ్లీ జట్టులో ఉండటంతో రజత్ గురించి ఎవరూ మాట్లాడటం లేదని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ చరిత్రలో ఒక్కేఒక్కరు సాధించిన అరుదైన ఘనతను, తాజాగా ఆర్సీబీ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్, సుయాశ్ శర్మ సాధించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 ఛాంపియన్గా నిలవడంతో ఈ ఇద్దరూ హ్యాట్రిక్ ఐపీఎల్ టైటిళ్ల అరుదైన ఫీట్ను నమోదు చేశారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో సారి ఐపీఎల్ టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. తన జట్టు రెండు ట్రోఫీలను ముద్దాడటంతో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సంబరాలు అంబరాన్ని అంటాయి. తాను క్రికెట్ దిగ్గజాన్ని అనే విషయాన్ని మర్పిపోయి మరీ సంబరాలు చేసుకుంటున్నాడు.
ఈ ఏడాది సీజన్ ఛాంపియన్స్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. గుజరాత్ టైటాన్స్ నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 5 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో చేధించి రెండో ఐపీఎల్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. అలానే ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది ఆర్సీబీ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఏడాది ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆదివారం గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయాన్ని సాధించడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరు నగరం అర్ధరాత్రి వేళ బాణసంచా వెలుగులు, టపాసుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని వరుసగా రెండోసారి ముద్దాడింది. విజయానంతరం ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. లీగ్ దశలో కాస్త తడబడినా.. ముంబై ఇండియన్స్పై ఉత్కంఠపోరులో విజయం సాధించడం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని అన్నాడు.
ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్-2026 ఆఖరి మ్యాచ్ నేడే. బలమైన బ్యాటింగ్, నాణ్యమైన బౌలింగ్ విభాగాలతో కూడిన ఆర్సీబీ, జీటీ జట్ల మధ్య జరిగే తుది పోరు అభిమానులకు క్రికెట్ విందు కానుంది. మరి ఈ మ్యాచ్లో బరిలోకి దిగబోయే కీలక ఆటగాళ్ల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే...