Share News

ఆసియా క్రీడలు: డబుల్ సిల్వర్.. భారత షూటర్లను అభినందించిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Sep 20 , 2026 | 07:28 PM

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో సత్తా చాటిన భారత షూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌, వ్యక్తిగత విభాగాల్లో భారత్‌కు రెండు రజత పతకాలు దక్కిన సంగతి తెలిసిందే.

ఆసియా క్రీడలు: డబుల్ సిల్వర్.. భారత షూటర్లను అభినందించిన ప్రధాని మోదీ
Narendra Modi

ఇంటర్నెట్ డెస్క్: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో సత్తా చాటిన భారత షూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌, వ్యక్తిగత విభాగాల్లో భారత్‌కు రెండు రజత పతకాలు దక్కిన సంగతి తెలిసిందే. టీమ్‌ ఈవెంట్‌లో ఎలావెనిల్‌ వలరివన్‌, సోనం‌ ఉత్తమ్‌ మాస్కర్‌, విదర్శ వినోద్‌ రజతం సాధించగా.. వ్యక్తిగత విభాగంలోనూ వలరివన్ మరో సిల్వర్‌ మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.


ఒకే రోజు రెండు రజత పతకాలు సాధించిన ఎలావెనిల్‌ వలరివన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. భారత షూటర్లు దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని పేర్కొంటూ.. ఎలావెనిల్‌ సాధించిన రెండో పతకం ఈ రోజును మరింత ప్రత్యేకంగా మార్చిందని అన్నారు. టీమ్‌ ఈవెంట్‌లో రజతం సాధించిన వలరివన్‌, సోనం ఉత్తమ్‌ మాస్కర్‌, విదర్శ వినోద్‌లను కూడా ప్రధాని అభినందించారు. వారి కృషి, టీమ్‌వర్క్‌ అద్భుత ఫలితాన్ని అందించాయని పేర్కొన్నారు. వారి విజయం రాబోయే రోజుల్లో మరెంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.


ఇవి కూడా చదవండి:

టీ20ల్లో ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

ఆసియా క్రీడలు: బంగ్లా ఘోర ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

Updated Date - Sep 20 , 2026 | 08:12 PM