అన్మోల్ ముందుకు..అస్మిత ఇంటికి
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:54 AM
భారత్కు చెందిన మూడో సీడ్ అన్మోల్ ఖర్బ్ ఇండోనేసియా మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో ప్రవేశించింది.
పోంటియానాక్ (ఇండోనేసియా): భారత్కు చెందిన మూడో సీడ్ అన్మోల్ ఖర్బ్ ఇండోనేసియా మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రౌండ్-8 మ్యాచ్లో అన్మోల్ 21-14, 13-21, 21-17తో హువాంగ్ చింగ్ (తైపీ)పై పోరాడి నెగ్గింది. మరో క్వార్టర్ఫైనల్లో అస్మిత 10-21, 18-21తో జు వెన్ జిన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది.
ఈ వార్తలను కూడా చదవండి
ఒకే గ్రామంలో ఇద్దరు గురువులకు అవార్డులు
వార్డుల పునర్విభజనకు పచ్చజెండా