తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత

ABN, Publish Date - Mar 06 , 2026 | 02:56 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృస్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు క్లీన్ చిట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ తిరుమల చేరుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత 1/6

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు గుమ్మడికాయతో దిష్టి తీస్తున్న వృద్ధురాలు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత 2/6

కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి కొండపైకి కాలి నడక మార్గాన వెళ్లిన కవిత. స్వామివారి అభిషేక సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత 3/6

కొడుకు ఆదిత్యతో కలిసి ఆలయంలో ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకున్న కల్వకుంట కవిత.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత 4/6

కార్యకర్తలతో కలిసి అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్న కల్వకుంట్ల కవిత

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత 5/6

శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నానని, స్వామి వారి ఆశీస్సులతో తన నాలుగేళ్ల మనోవేదన తీరిపోయిందని కవిత తెలిపారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత 6/6

కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆలయం వద్ద ఫోటో షూట్ లో పాల్గొన్న కవిత.

Updated at - Mar 06 , 2026 | 02:57 PM