సరూర్ నగర్, గంగారంలో వైభవంగా వినాయక నిమజ్జనం..
ABN, Publish Date - Sep 20 , 2026 | 09:02 PM
గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు.
1/8
గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.
2/8
వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు.
3/8
డప్పులు, బ్యాండ్ మేళాలు, గణపతి బప్పా మోరియా అంటూ భక్తుల నినాదాలతో గంగారం, సరూర్నగర్ చెరువుల్లో వైభవంగా వినాయక నిమజ్జనం జరిగింది.
4/8
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా భక్తులు ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
5/8
అలాగే గణపతి పందిళ్లలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. దీంతో పలు పందిళ్లలో భక్తుల సందడి నెలకొంది.
6/8
నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.
7/8
ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు, లైటింగ్, తాగునీరుతోపాటు భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.
8/8
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జన ప్రాంతంలో ప్రత్యేక నిఘా కొనసాగించారు.
Updated at - Sep 20 , 2026 | 09:10 PM