సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్

ABN, Publish Date - Jan 26 , 2026 | 06:51 PM

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 1/19

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎగరవేశారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 2/19

అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 3/19

రిపబ్లిక్ డే వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 4/19

అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 5/19

ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 6/19

అమెరికా పర్యటనలో ఉండటంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరుకాలేదు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 7/19

సీఎం రేవంత్ రెడ్డి రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా సందేశమిచ్చారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 8/19

భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత అని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 9/19

ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిందని.. ఈ డాక్యుమెంట్ హైదరాబాద్ ఇమేజ్‌ను మరింత పెంచుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 10/19

రాష్ట్రాన్ని మూడు ఎకనమిక్ జోన్లుగా విభజించి, కీలక రంగాలకు ప్రత్యేకమైన జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 11/19

మేడారం అభివృద్ధి కోసం రూ.251కోట్లు కేటాయించినట్లు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 12/19

రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, గతేడాది బతుకమ్మ వేడుకలు గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 13/19

26 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు, ధాన్యానికి బోనస్‌గా రైతులకు రూ.1,780కోట్లు అందజేశామని గవర్నర్ వెల్లడించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 14/19

ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 15/19

భూ వివాదాలను పరిష్కరించేందుకు భూభారతి చట్టం తీసుకొచ్చామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 16/19

గ్రూప్-1, 2, 3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, ఇప్పటివరకు 62 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 17/19

ఐటీఐలను అడ్వాన్స్‌ టెక్నికల్ సెంటర్లుగా మార్చి, తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 18/19

విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్ 19/19

మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.

Updated at - Jan 26 , 2026 | 07:13 PM