ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు
ABN, Publish Date - May 11 , 2026 | 08:12 AM
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు.
1/6
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు.
2/6
ప్రధాని రాకను గురించి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని రాకను పురస్కరించుకుని ఇంటి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
3/6
ప్రధాని మోదీకి స్వాగతం పలకడం నుంచి ఆతిథ్యం వరకు అన్ని విషయాలను మంత్రి లోకేశ్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు.
4/6
ప్రధాని మోదీ.. తమ నివాసానికి రావడం ఒక మధుర జ్ఞాపకమని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. తమ నివాసానికి విచ్చేసిన ప్రధాని మోదీ.. ఎంతో ఆత్మీయంగా అందరినీ పలకరించారని చెప్పారు.
5/6
ఒక దేశ ప్రధానిగా కాకుండా.. కుటుంబ సభ్యునిలా ఆయన పంచిన ప్రేమ, ఆప్యాయత తమను ఎంతో ఆకట్టుకుందన్నారు. దివంగత నందమూరి తారకరామారావు స్వయంగా పూజించిన శ్రీరాముని విగ్రహాలకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు.
6/6
ప్రధానమంత్రి అందించిన ఈ ఆత్మీయ గౌరవం తమ కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప జ్ఞాపకమని నారా భువనేశ్వరి ఎక్స్ ఖాతా వేదికగా పేర్కొన్నారు.
Updated at - May 11 , 2026 | 08:24 AM