తిరుమల శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ABN, Publish Date - Mar 21 , 2026 | 10:38 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు.
1/10
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
2/10
సీఎం హోదాలో ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో సామాన్య భక్తుడిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామివారి దర్శనానికి వెళ్లారు.
3/10
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
4/10
స్వామి వారి తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రి దంపతులకు అందజేస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
5/10
శ్రీవారి ఆలయం ముందు భక్తులతో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల సందడి.
6/10
వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సీఎం చంద్రబాబు, మనవడు దేవాన్ష్ స్వయంగా అన్నప్రసాదాలను భక్తులకు వడ్డించారు.
7/10
భక్తులకు అన్నప్రసాదాలను స్వయంగా వడ్డిస్తున్న నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్
8/10
భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించిన తర్వాత అన్నదాన సత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం చేశారు.
9/10
ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనవడు దేవాన్ష్తో కలిసి భక్తుల దగ్గరికి వెళ్లి వారితో కరచాలం చేశారు. భక్తులు దేవాన్ష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
10/10
భక్తులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మనవడు దేవాన్ష్ ఫోటో దిగారు.
Updated at - Mar 21 , 2026 | 11:53 AM