అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం
ABN, Publish Date - Sep 11 , 2026 | 08:31 AM
సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. లీడర్షిప్, జీఎస్డీపీ, తాగునీరు, గృహ నిర్మాణం, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది.
1/15
సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది.
2/15
8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
3/15
రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో లీడర్షిప్, జీఎస్డీపీ, తాగునీరు, గృహ నిర్మాణం, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్పై చర్చించారు.
4/15
ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం.. ప్రజా సేవకులుగా నిలుద్దామని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
5/15
సాధించింది చెబుదాం... సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుదామని వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
6/15
రాష్ట్ర పునర్నిర్మాణంలో 27 నెలల్లో రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను గాడిన పెట్టామని స్పష్టం చేశారు.
7/15
రూ.1.40 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ. 1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశామని వివరించారు.
8/15
రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరిట ప్రగతి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
9/15
హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్ -1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు.
10/15
పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు.
11/15
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి గుంటూరు, విజయవాడకు రాజధానిని కనెక్టు చేశామని తెలిపారు.
12/15
ఎకనామిక్ టైమ్స్ పత్రిక సీఈఓ టూ వాటర్మాన్ అంటూ కథనం రాసిందని.. ఇది తనకు సంతోషం కలిగించిందన్నారు. గ్లోబల్ డ్రీమ్ కేబినెట్లో తన పేరు వచ్చినప్పుడు, సీఈఓ సీఎం అన్నప్పుడు నేను ఇంత ఆనందించలేదని పేర్కొన్నారు.
13/15
మనకు ఉన్న అవకాశాలను అన్ లాక్ చేయగలిగామని.. ప్రతీ శాఖలోనూ సంస్కరణలు తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు వివరించారు.
14/15
గత ప్రభుత్వం నిర్వాకంతో మార్కెట్లోకి వచ్చిన జే బ్రాండ్ మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని.. చాలా మంది ఆరోగ్యం కూడా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.
15/15
ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయంటే అభివృద్ధి-పాలన పెండింగ్లో ఉన్నట్లేనని సీఎం చంద్రబాబు తెలిపారు.
Updated at - Sep 11 , 2026 | 08:43 AM