Share News

పెరుగుకూ ఓ లెక్కుంది.!

ABN , Publish Date - May 16 , 2026 | 01:16 AM

పెరుగును తీసుకునేటప్పుడు చేసే చిన్న పొరబాట్ల వల్ల కడుపు ఉబ్బరం, మొటిమలు, శరీర ఉష్ణోగ్రత పెరగడం లాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. వేసవికాలంలో...

పెరుగుకూ ఓ లెక్కుంది.!

పెరుగును తీసుకునేటప్పుడు చేసే చిన్న పొరబాట్ల వల్ల కడుపు ఉబ్బరం, మొటిమలు, శరీర ఉష్ణోగ్రత పెరగడం లాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. వేసవికాలంలో పెరుగును ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం...

  • ఫ్రిజ్‌లో నుంచి తీసిన చల్లటి పెరుగును వెంటనే ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాకాకుండా అరగంట ముందే పెరుగును బయటికి తీసి అది సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకున్నాక తీసుకోవడం మంచిది.

  • రాత్రి పూట పెరుగు తినడం వల్ల అజీర్ణం, జలుబు, గొంతు సమస్యలు రావచ్చు. కాబట్టి అందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొన్ని నీళ్లు కలుపుకుని తీసుకోవడం మంచిది.

  • చిక్కటి పెరుగును నేరుగా తినకూడదు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బ తగలవచ్చు. కడుపులో గ్యాస్‌, ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు పెరుగును ఎక్కువగా తినకూడదు. ప్రత్యామ్నాయంగా వీరు పలుచని మజ్జిగ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.

  • చక్కెర కలిపిన తియ్యటి పెరుగు తినడం వల్ల శరీరం బరువు పెరుగుతుంది. రాత్రిపూట నిద్రాభంగం కలగవచ్చు. కాబట్టి చక్కెర మోతాదును తగ్గించడం మంచిది.

  • పెరుగులో తగినన్ని నీళ్లు పోసి బాగా చిలికి మజ్జిగ తయారుచేయాలి. అందులో చిటికెడు నల్ల ఉప్పు, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి కలుపుకుని తాగితే తేలికగా జీర్ణమవుతుంది. కడుపులో చల్లగా అనిపిస్తుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది.

  • ఒక కప్పు పెరుగులో పావు కప్పు కీరా తురుం, కొన్ని దానిమ్మ గింజలు, కొద్దిగా పుదీనా తరుగు వేసి బాగా కలిపి తినవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 16 , 2026 | 01:16 AM