Share News

జమ్మూ కశ్మీర్‌ ఉరీ సెక్టార్‌లో ప్రమాదం.. గ్రనేడ్‌ పేలి ఇద్దరు జవాన్ల మృతి

ABN , Publish Date - Jun 10 , 2026 | 07:38 AM

జమ్మూ కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్ కమల్‌కోట్ ఆర్మీ క్యాంపులో ఘోర ప్రమాదం జరిగింది. గ్రనేడ్‌ పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు..

జమ్మూ కశ్మీర్‌ ఉరీ సెక్టార్‌లో ప్రమాదం.. గ్రనేడ్‌ పేలి ఇద్దరు జవాన్ల మృతి
Uri Sector Grenade Blast

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉరీ సెక్టార్‌లోని కమల్‌కోట్ ఆర్మీ క్యాంపులో జరిగిన గ్రనేడ్ పేలుడు ప్రమాదంలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కమల్‌కోట్‌లోని ఆర్మీ క్యాంపులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉరీ సెక్టార్, కమల్‌కోట్ పరిధిలోని సరిహద్దు రక్షణ శిబిరంలో జవాన్లు తమ విధులను ముగించుకుని.. ఆయుధాలు, ఇతర పరికరాలను తోటి సిబ్బందికి అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న ఒక హ్యాండ్ గ్రనేడ్ అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ తీవ్రమైన పేలుడు ధాటికి అక్కడే ఉన్న ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇద్దరు సైనికులను తోటి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదకర ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.


ఈ వార్తలు కూడా చదవండి

అడిగి మరీ మసాజ్ చేయించుకున్న ఏనుగు.. వైరల్ వీడియో

కొంపముంచిన రూ. 370 బిర్యానీపై కామెంట్లు.. ఇలా జరుగుతుందని అనుకోలేదు..

Updated Date - Jun 10 , 2026 | 07:56 AM