Share News

రేపు అయోధ్య రామమందిర ట్రస్ట్ అత్యంత కీలక సమావేశం..

ABN , Publish Date - Jul 05 , 2026 | 09:30 PM

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. రామ మందిర విరాళాల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.

రేపు అయోధ్య రామమందిర ట్రస్ట్ అత్యంత కీలక సమావేశం..
Ayodhya Ram Mandir

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. రామ మందిర విరాళాల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం జరగబోయే సమావేశంలో ఈ రాజీనామాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రస్ట్ వర్గాలు తెలిపాయి (Ram Mandir Trust Meeting).


అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావనీలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సమర్పించిన మధ్యంతర నివేదికపై కూడా చర్చించనున్నారు. విరాళాల లెక్కింపు, నిర్వహణలో గుర్తించిన అంశాలపై సభ్యులకు వివరాలు అందించే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తులో ఆలయ పరిపాలనను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించనున్నారు (Ayodhya Ram Mandir SIT Probe).


2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ పూర్తి కాని ఆదాయం-వ్యయ వివరాలు, బ్యాలెన్స్ షీట్‌ను ఆమోదానికి ఉంచనున్నారు. ఆలయ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ముఖ్య కార్యనిర్వాహక అధికారి (CEO) నియామకంపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.


ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది (Ram Temple Donation Case). కాగా, రామ మందిర విరాళాల అక్రమాలపై సిట్ విచారణతో పాటు పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఇప్పటివరకు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా సహా పలువురి వాంగ్మూలాలను అధికారులు నమోదు చేశారు. అయితే ఈ ఇద్దరిపై ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్‌లో సేవా రుసుం.. మిత్ర దేశాలకు ప్రత్యేక రాయితీలు: ఇరాన్


సోషల్ మీడియా వల్ల విభేదాలు.. భార్యను చంపేసిన భర్త..

Updated Date - Jul 05 , 2026 | 09:34 PM