Share News

రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు చొప్పున పీఎం కిసాన్ డబ్బులు జమ

ABN , Publish Date - Jun 20 , 2026 | 05:42 PM

పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యాయి. ప్రధాని మోదీ 23వ విడత నిధులను విడుదల చేశారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 18,880 కోట్లు నేరుగా జమయ్యాయి.

రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు చొప్పున పీఎం కిసాన్ డబ్బులు జమ
PM Kisan 23rd Installment Released Today

కోల్‌కతా/తారకేశ్వర్, జూన్ 20: పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యాయి. ప్రధాని మోదీ 23వ విడత నిధులను విడుదల చేశారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 18,880 కోట్లు నేరుగా జమయ్యాయి. ఈ విడతలో దేశవ్యాప్తంగా సుమారు 2.18 కోట్ల మంది మహిళా రైతులు లబ్ధి పొందడం విశేషం. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రైతులకు అందిన మొత్తం సాయం రూ. 4.46 లక్షల కోట్లు దాటింది.


పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ (PM-KISAN) యోజన 23వ విడత నిధులను విడుదల చేశారు. ఈ నిధుల విడుదలతో పాటు, పశ్చిమ బెంగాల్ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ పలు కీలక పథకాలను, డిజిటల్ విప్లవాన్ని ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం!

ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు

Updated Date - Jun 20 , 2026 | 06:14 PM