Share News

పీవోకేలో పాక్‌ సైన్యం కాల్పుల్లో 20మంది మృతి

ABN , Publish Date - Jul 29 , 2026 | 07:24 AM

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్‌ ప్రాంతంలో స్థానిక ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన ప్రజా సంఘాలు, పౌరులపై పాక్‌ సైన్యం ఉక్కుపాదం మోపింది.

పీవోకేలో పాక్‌ సైన్యం కాల్పుల్లో 20మంది మృతి

న్యూఢిల్లీ, జూలై 28: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్‌ ప్రాంతంలో స్థానిక ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన ప్రజా సంఘాలు, పౌరులపై పాక్‌ సైన్యం ఉక్కుపాదం మోపింది. నిరసనకారులపై విచక్షణారహితంగా సాగించిన కాల్పుల్లో గత 24 గంటల్లో 20మంది ప్రాణాలు కోల్పోగా.. 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Updated Date - Jul 29 , 2026 | 08:31 AM