20 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. నింబాల్కర్ హత్య కేసులో మాజీ మంత్రికి విముక్తి..
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:58 PM
రెండు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్న పావన్రాజే నింబాల్కర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, పద్మసింహ్ పాటిల్తో పాటు మొత్తం తొమ్మిది మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
రెండు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్న పావన్రాజే నింబాల్కర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, పద్మసింహ్ పాటిల్తో పాటు మొత్తం తొమ్మిది మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 20 సంవత్సరాల పాటు సాగిన ఈ కేసులో 128 మంది సాక్షులను విచారించిన అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించింది (Nimbalkar Case).
2006 జూన్ 3న కాంగ్రెస్ నేత పావన్రాజే నింబాల్కర్ తన డ్రైవర్ సమద్ అబ్దుల్ వాహిద్ కాజీతో కలిసి ప్రయాణిస్తుండగా నవీ ముంబైలోని కలంబోలి ప్రాంతంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నింబాల్కర్, ఆయన డ్రైవర్ మరణించారు. ఈ హత్యలకు రాజకీయ శత్రుత్వమే కారణమని దర్యాప్తు సంస్థలు అప్పట్లో వెల్లడించాయి. నింబాల్కర్ను రాజకీయంగా తొలగించేందుకు పద్మసింహ్ పాటిల్ కుట్ర పన్నారని, దానికి పలువురు సహకరించారని సీబీఐ పేర్కొంది (Padamsinh Patil Acquitted).
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది (Maharashtra Politics). నిందితులపై అభియోగాలు నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని ప్రత్యేక సీబీఐ కోర్టు పేర్కొంది. దీంతో పద్మసింహ్ పాటిల్ సహా మిగతా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు తీర్పుపై సీబీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పును బాంబే హైకోర్టులో సవాలు చేయనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
వైరల్ వీడియో.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి..
ఇదీ జెన్ జీ పవర్.. చెత్తకుప్పలా మారిన నదికి 50 రోజుల్లో జీవం పోశారు..