మహారాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ విద్యుత్ కనెక్షన్లు
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:33 PM
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలలో 'కంపొజిట్ బిల్లింగ్ సిస్టమ్' అమలుకు మహారాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ముంబై, ఆగస్టు 4: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పరిధిలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలలో ద బృహన్ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (BEST) ద్వారా 'కంపొజిట్ బిల్లింగ్ సిస్టమ్' (CBS) అమలుకు మహారాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తద్వారా ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్లన్నింటినీ ప్రీపెయిడ్ విధానంలోకి మార్చాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆలస్య రుసుములు, వడ్డీ భారానికి చెక్
కరెంట్ బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యం వల్ల ప్రభుత్వానికి పడుతున్న 12 నుంచి 15 శాతం వడ్డీ భారం, ఆలస్య రుసుములను నివారించడమే ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యం. బిల్లుల పరిశీలన, నిధుల కేటాయింపు, చెల్లింపుల ప్రాసెసింగ్ కోసం అవసరమయ్యే మానవ వనరుల వినియోగాన్ని తగ్గించి, మరింత పారదర్శకత, వేగాన్ని తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది.
కంపొజిట్ బిల్లింగ్ సిస్టమ్ (CBS) ప్రయోజనాలు
సింగిల్ ప్లాట్ఫారమ్, ఆటో-డెబిట్: ప్రభుత్వ కనెక్షన్ల బిల్లులన్నీ ఒకే ప్లాట్ఫారమ్ ద్వారా ప్రాసెస్ అవుతాయి. ఆటో-డెబిట్ సదుపాయం ఉండటం వల్ల బిల్లులు సమయానికి చెల్లించడం ద్వారా, జరిమానాలు తప్పుతాయి.
రియల్-టైమ్ డ్యాష్బోర్డ్: బిల్లులు, విద్యుత్ వినియోగం, బకాయిలు, లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే డ్యాష్బోర్డ్ ద్వారా రియల్-టైమ్లో పర్యవేక్షించవచ్చు.
రాయితీలు, డిస్కౌంట్లు: 'గో గ్రీన్' (Go Green) చొరవ కింద డిజిటల్ బిల్లింగ్పై డిస్కౌంట్లు లభిస్తాయి. అలాగే ప్రీపెయిడ్ విద్యుత్ వినియోగదారులకు టారిఫ్లలో ప్రత్యేక విసులుబాట్లు, సడలింపులు ఉంటాయి.
ఇవి కూడా చదవండి...
కిడ్నాప్ కేసు.. గుజరాత్లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్
పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్
Read Latest AP News And Telugu News