Share News

దేశంలోనే తొలి పునర్వినియోగ రాకెట్‌ ఇంజన్‌

ABN , Publish Date - May 28 , 2026 | 06:15 AM

బిట్స్‌పిలానీ హైదరాబాద్‌ క్యాంప్‌సలోని ’అబ్యోమ్‌ స్పేస్‌టెక్‌ అండ్‌ డిఫెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలి పునర్వినియోగ(రీయూజబుల్‌) లిక్విడ్‌ రాకెట్‌...

దేశంలోనే తొలి పునర్వినియోగ రాకెట్‌ ఇంజన్‌

  • క్వాలిఫికేషన్‌ పరీక్ష విజయవంతం

  • బిట్స్‌పిలానీ, హైదరాబాద్‌ క్యాంప్‌సలోని ‘అబ్యోమ్‌ స్పేస్‌టెక్‌’ ఘనత

బిట్స్‌ పిలానీ, మే 27 (ఆంధ్రజ్యోతి): బిట్స్‌పిలానీ హైదరాబాద్‌ క్యాంప్‌సలోని ’అబ్యోమ్‌ స్పేస్‌టెక్‌ అండ్‌ డిఫెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలి పునర్వినియోగ(రీయూజబుల్‌) లిక్విడ్‌ రాకెట్‌ ఇంజన్‌ క్వాలిఫికేషన్‌ టెస్ట్‌ క్యాంపెయిన్‌ను విజయవంతంగా పూర్తి చేసి అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రాకెట్‌ను అబ్యోమ్‌ బృందమే అభివృద్ధి చేసింది. సాధారణంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్లను మరోసారి ఉపయోగించరు. కానీ ద్రవ ఇంధనంతో నడిచే పునర్వినియోగ లిక్విడ్‌ రాకెట్లను మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి సాంకేతికత అభివృద్ధికి అయ్యే వ్యయంతో పోలిస్తే కేవలం పదో వంతు ఖర్చుతోనే ఈ పరీక్షలు పూర్తి చేయడం విశేషం. అబ్యోమ్‌ సంస్థ స్వయంగా రూపొందించిన కమర్షియల్‌ టెస్ట్‌ ఫెసిలిటీ (సీటీఎ్‌ఫ)లోనే ఈ పరీక్షలు నిర్వహించారు. సంస్థ అభివృద్ధి చేస్తున్న ’ఫ్లైట్‌ రెడీ క్రయోజెనిక్‌ ఇంజిన్‌‘ (ఎఫ్‌ఆర్‌ఈ), ’హోప్‌ వీవీటీఎల్‌‘ రీయూజబుల్‌ రాకెట్‌ ప్రోగ్రామ్‌లకు ఈ విజయం కీలక మైలురాయిగా నిలిచింది. కాగా, తాము చేపట్టింది కేవలం ఇంజన్‌ పరీక్ష మాత్రమే కాదని భారత్‌లో స్వదేశీ రీయూజబుల్‌ ప్రొపల్షన్‌ ఎకోసిస్టమ్‌ నిర్మాణానికి నాంది పలికామని అబ్యోమ్‌ స్పేస్‌టెక్‌ అండ్‌ డిఫెన్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జైనుల్‌ అబేదిన్‌ ఈ సందర్భంగాఅన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 06:15 AM