ఐబీ చీఫ్గా ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి.. కేంద్రం ఆదేశాలు
ABN , Publish Date - Jun 26 , 2026 | 09:00 AM
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) కొత్త చీఫ్గా మహేశ్ దీక్షిత్ను కేంద్రం నియమించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తాజాగా సమావేశమై.. ఆయన నియామకానికి ఆమోద ముద్ర వేసింది.
న్యూఢిల్లీ, జూన్ 26: ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) కొత్త చీఫ్గా మహేశ్ దీక్షిత్ను కేంద్రం నియమించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తాజాగా సమావేశమై.. ఆయన నియామకానికి ఆమోద ముద్ర వేసింది. దాంతో ఐబీ అధిపతిగా మహేశ్ దీక్షిత్ను నియమిస్తూ కేంద్రం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటి వరకు ఐబీ చీఫ్గా ఉన్న తపన్ కుమార్ దేకా పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మహేశ్ దీక్షిత్ను కేంద్రం నియమించింది. 1993 బ్యాచ్ ఆంధ్రా క్యాడర్ ఐపీఎస్ అధికారి ఆయన.
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో లోయలో శాంతిభద్రతల పునరుద్ధరణలో మహేశ్ దీక్షిత్ కీలక పాత్ర పోషించారు. కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక చర్యలను ఆయన సారథ్యంలో సమర్థవంతంగా నియంత్రించారు. ఈ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. లేకుంటే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు.
ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఐబీలో ఆయన స్పెషల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఐబీలో అంతర్గత భద్రత కార్యకలాపాల్లో అత్యంత అనుభవజ్ఞులైన అధికారుల్లో ఒకరిగా మహేశ్ దీక్షిత్ గుర్తింపు పొందారు.
ఇవి కూడా చదవండి
మద్యం మత్తులో పెళ్లికి వచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందంటే..
బీఈడీ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే!
For More National News And Telugu News