కాక్రోచ్ జనతా పార్టీకి భారీ ఊరట.. 'ఎక్స్' అకౌంట్ను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:25 PM
ఢిల్లీ హైకోర్టులో కాక్రోచ్ జనతా పార్టీకి పెద్ద ఊరట లభించింది. వివాదాస్పద కారణాల వల్ల గతంలో నిలిపివేసిన ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ, జులై 7: ఢిల్లీ హైకోర్టులో కాక్రోచ్ జనతా పార్టీకి (CJP) పెద్ద ఊరట లభించింది. వివాదాస్పద కారణాల వల్ల గతంలో నిలిపివేసిన ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల్లో అర్థం లేదు: హైకోర్టు వ్యాఖ్యలు
నీట్ పరీక్ష ముగిసిన నేపథ్యంలో, ఈ అకౌంట్పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. నీట్ ఎగ్జామ్స్ పూర్తయిన ప్రస్తుత తరుణంలో, సదరు పార్టీ సోషల్ మీడియా ఖాతాను ఇంకా హోల్డ్లో ఉంచడం లేదా నిషేధాన్ని కొనసాగించడంలో ఎలాంటి అర్థం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. పరీక్షల నిర్వహణ సమయంలో శాంతిభద్రతలు లేదా ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా ఆంక్షలు విధించినప్పటికీ, ఇప్పుడు వాటిని పొడిగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
హైకోర్టు తాజా ఉత్తర్వులతో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మరో 24 నుంచి 48 గంటల్లో సీజేపీ అధికారిక 'ఎక్స్' హ్యాండిల్ తిరిగి యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
అమ్మేవాడు లేకుండానే భూముల రిజిస్ట్రేషన్లు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News