Share News

నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌కు ఢిల్లీ హైకోర్టు మూడు వారాల గడువు..

ABN , Publish Date - Jul 28 , 2026 | 10:45 AM

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది.

నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌కు ఢిల్లీ హైకోర్టు మూడు వారాల గడువు..
National Herald case

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన పిటిషన్‌కు మూడు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోనియా, రాహుల్‌తో పాటు సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ ప్రతినిధులకు కూడా నోటీసులు ఇచ్చింది (National Herald case).


జస్టిస్ మనోజ్ జైన్ నేతృత్వంలోని ధర్మాసనం.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంపై తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. కాగా, ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఛార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. పోలీస్ ఎఫ్‌ఐఆర్ లేకుండా ఈడీ కేసు ముందుకు సాగదని ట్రయల్ కోర్టు పేర్కొంది. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు (Sonia Gandhi ED case).


2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును దాఖలు చేశారు (Rahul Gandhi ED petition). తర్వాత ఈడీ మనీలాండరింగ్ కోణంలో విచారణ ప్రారంభించింది. 2025లో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దిగువ కోర్టు ఆ ఛార్జ్‌షీట్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి..

ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..


స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 28 , 2026 | 11:09 AM