ఆన్స్క్రీన్ మార్కింగ్ పోర్టల్ అవకతవకలు.. కేంద్రం కీలక నిర్ణయం
ABN , Publish Date - Jun 02 , 2026 | 08:45 PM
సీబీఎస్ఈ 12వ తరగతిలో ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
న్యూఢిల్లీ, జూన్02: సీబీఎస్ఈ 12వ తరగతిలో ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, బోర్డు కార్యదర్శి హిమాన్షు గుప్తాలను బదిలీ చేసింది. ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సేవలపై విచారణకు కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చైర్మన్గా ఎస్ రాధా చౌహాన్ నియమించింది. తన నివేదికను నెల లోపు సిబ్బంది, శిక్షణ విభాగం (డీపీఓటీ)కు ఈ కమిటీ అందజేయనుంది.
ఈ వ్యవహారంలో జవాబు పత్రాలు తారుమారు కావడం, మూల్యాంకనంలో లోపాలు, తప్పులు దిద్దడం, గ్రేడ్లను తప్పుగా కేటాయించినట్లు గుర్తించారు. మ్యూల్యాంకన ప్రక్రియలో సుమారు 20 జవాబు పత్రాలు పొంతన లేనివిగా గుర్తించినట్లు సీబీఎస్ఈ అధికారులు కూడా అంగీకరించారు. విద్యార్థులతోపాటు సైబర్ సెక్యూరిటీ నిపుణులు సైట్లోని లోపాలతోపాటు సాంకేతిక సమస్యలు వివరించారు. పార్లమెంట్లో ఈ అంశంపై చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
ఇవి కూడా చదవండి..
మమతకు షాక్.. ధర్నాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్కు మద్రాసు హైకోర్టులో ఊరట
For More National News And Telugu News