అమృత్సర్ పోలీస్ అధికారి హత్య నిందితుడి మృతి.. పాక్ ఉగ్రవాది ప్రమేయంపై దర్యాప్తు..
ABN , Publish Date - Sep 20 , 2026 | 10:07 AM
పంజాబ్లోని అమృత్సర్లో పోలీస్ అధికారి హర్జిత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దీపక్ సింగ్ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మరో నిందితుడు పరారయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్లోని అమృత్సర్లో పోలీస్ అధికారి హర్జిత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దీపక్ సింగ్ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మరో నిందితుడు పరారయ్యాడు. పోలీస్ అధికారి హత్య వెనుక పాకిస్థాన్లో ఉన్న ఓ ఉగ్రవాదితో సంబంధాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది (Amritsar cop killing).
ఏఎస్ఐ హర్జిత్ సింగ్ సెప్టెంబర్ 18న అమృత్సర్లో పోలీస్ కంట్రోల్ రూమ్ విధుల్లో ఉన్నారు. భగ్తన్వాలా ధాన్యం మార్కెట్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై ఆయనను వెంబడించి కాల్పులు జరిపారు. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి .30 బోర్ తుపాకీకి సంబంధించిన ఖాళీ తూటా కేసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య అనంతరం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేశారు (Deepak Singh encounter).
దర్యాప్తు ఆధారంగా పోలీసులు దీపక్ సింగ్ను నిందితులలో ఒకడిగా గుర్తించారు. శనివారం రాత్రి పోలీసులు చెక్పోస్టు వద్ద ఇద్దరు అనుమానితులను ఆపేందుకు ప్రయత్నించగా వారు కాల్పులు జరిపారు. పోలీసుల జరిపిన ఎదురుకాల్పుల్లో దీపక్ సింగ్ గాయపడ్డాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఎన్కౌంటర్ సమయంలో మరో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి (Punjab Police encounter).
పాకిస్థాన్లో ఉన్న ఓ వ్యక్తి నిందితులకు డబ్బు ఇస్తామని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఈ దాడికి ప్రేరేపించాడనే సమాచారం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏఎస్సైను పాక్ ఉగ్రవాది ఎందుకు టార్గెట్ చేశాడనే కోణంలో విచారణ సాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రియాద్ విమానాశ్రయం సమీపంలో మంటలు.. సౌదీలో కీలక ప్రాంతాలపై హౌతీల దాడులు..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..