-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 1st August 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Aug 01 , 2026 | 07:44 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Aug 01, 2026 09:39 IST
పశ్చిమ విదర్భ-మధ్యప్రదేశ్ దగ్గర వాయుగుండం
పశ్చిమ వాయువ్య దిశగా వాయుగుండం ప్రయాణం
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కు భారీ వర్ష సూచన
-
Aug 01, 2026 09:24 IST
నిజామాబాద్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు పర్యటన
కడెం, SRSP, ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిశీలన
వరద పరిస్థితులు, నీటి నిల్వలపై మంత్రులు సమీక్ష
-
Aug 01, 2026 09:23 IST
విజయనగరం: ఎయిర్పోర్ట్కు భూములిచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం
ప్రత్యేక అతిథులుగా రైతులకు ఆహ్వానం
ప్రధాని సభలో VVIP గ్యాలరీలో రైతులకు చోటు
403 మంది రైతులకు ఆహ్వానం
ఇళ్లు ఇచ్చిన 1,600 మందికి ప్రత్యేక గుర్తింపు
-
Aug 01, 2026 09:23 IST
ఢిల్లీ: రూ.200 తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
హైదరాబాద్లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,985
-
Aug 01, 2026 09:22 IST
ఇరాన్పై మళ్లీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు
ఇరాన్లో విద్యుత్ మౌలిక సదుపాయాలే టార్గెట్
-
Aug 01, 2026 09:22 IST
జమ్మూకశ్మీర్లో ఇద్దరు కార్మికులను కాల్చిచంపిన ఉగ్రవాదులు
కుల్గాం జిల్లాలోని కెల్లమ్ గ్రామంలో ఘటన, ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు
-
Aug 01, 2026 09:21 IST
ఢిల్లీ: భద్రతా కారణాలతో కర్తార్పూర్ కారిడార్ మూసివేత: కేంద్రం
-
Aug 01, 2026 09:16 IST
ఏలూరు: పోలవరం దగ్గర వరద ఉధృతి
పోలవరం స్పిల్వే ఎగువన 33.5 మీటర్ల ప్రవాహం
కాపర్ డ్యాం ఎగువన 33.6గా నీటిమట్టం
46 గేట్ల ద్వారా 10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
-
Aug 01, 2026 09:15 IST
హైదరాబాద్: విశ్రాంత ఐపీఎస్ కుమార్తెకు అదనపు కట్నం వేధింపులు
వరుడు ఆస్ట్రేలియాలో ఎంఎస్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారంటూ నమ్మబలికి భారీగా కట్నం, బంగారం తీసుకున్న వైనం
2024 అక్టోబర్లో వివాహం
రోజులు గడుస్తున్నా ఆస్ట్రేలియాకు వెళ్ళని వరుడు
ఎంఎస్ పూర్తి చేయలేదని తెలుసుకొని నిలదీసిన యువతి
అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టిన భర్త
జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, అత్తింటి వారిపై కేసు నమోదు
-
Aug 01, 2026 09:13 IST
విజయనగరం: ఏపీ కళలు, సంస్కృతితో ఎయిర్పోర్ట్ ప్రాంగణానికి అలంకరణ
ఎయిర్పోర్ట్ స్వాగత ద్వారం దగ్గర భారీ ఏటికొప్పాక కళాకృతి
ఎయిర్పోర్ట్ లోపల తోలు బొమ్మలు, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది, బంగినపల్లి మామిడి చిత్రాల అలంకరణ
టెర్మినల్ భవనం ప్రారంభించిన తర్వాత ఏపీ సాంస్కృతిక వైభవాన్ని తిలకించనున్న ప్రధాని మోదీ
-
Aug 01, 2026 09:09 IST
గుంటూరు: వైసీపీ నేతల తీరును తప్పుబట్టిన వైసీపీ ఎమ్మెల్సీ ఏసురత్నం
మహిళా ఎస్ఐపై దాడి అమానుషం
పోలీసు శాఖకు సంఘీభావం ప్రకటిస్తున్నా: ఎమ్మెల్సీ ఏసురత్నం
-
Aug 01, 2026 09:08 IST
ఏలూరు: పోలవరం దగ్గర వరద ఉధృతి
పోలవరం స్పిల్వే ఎగువన 33.5 మీటర్ల ప్రవాహం
కాపర్ డ్యాం ఎగువన 33.6గా నీటిమట్టం
46 గేట్ల ద్వారా 10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
-
Aug 01, 2026 07:55 IST
నేడు భోగాపురంలో ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్
ఉ.10:45 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ రాక
ప్రధానికి స్వాగతం పలకనున్న గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు
ఉ.11 నుంచి 11:15 వరకు ఎయిర్పోర్ట్ పరిశీలన
ఉ.11:30 గంటలకు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం, బహిరంగసభ
-
Aug 01, 2026 07:54 IST
నేడు ఏపీ, కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించనున్న మోదీ
మైసూర్లో వివేకా స్మారకం ప్రారంభించనున్న మోదీ
యువత సాధికారతే మా లక్ష్యం: ప్రధాని మోదీ
-
Aug 01, 2026 07:54 IST
విజయనగరంలో నేడు విద్యాసంస్థలకు సెలవు
ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా సెలవు
-
Aug 01, 2026 07:53 IST
విశాఖ: నేడు ఏయూలో జరగాల్సిన పరీక్షలు వాయిదా
ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా వాయిదా
-
Aug 01, 2026 07:53 IST
ములుగు: జిల్లాలో గోదావరి మహోగ్రరూపం
మంగపేట మండలం రామన్నగూడెం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
కొన్ని గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు
చాలా గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
-
Aug 01, 2026 07:52 IST
రాజమండ్రిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
రహదారులపై పొంగి ప్రవహించిన వర్షపునీరు
కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్ సెంటర్, కోటిపల్లి బస్టాండ్ శ్యామల సెంటర్లలో జలమయమైన రహదారులు
తీవ్ర ఇబ్బందులు పడిన వాహనదారులు
-
Aug 01, 2026 07:50 IST
జెర్పీ రంగు మార్పు వివాదం.. దిలీప్ టిర్కీ లేఖకు హాకీ ఇండియా వివరణ
నాలుగు పేజీల సమాధానం పంపిన డైరెక్టర్ జనరల్ కమాండర్
కార్యవర్గ సభ్యుల సమ్మతితోనే జెర్సీ రంగును మార్చామంటూ వివరణ
-
Aug 01, 2026 07:49 IST
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
రూ.1,44,610కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం
రూ.1,32,560కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం
కిలో వెండి ధర రూ.2,34,900
-
Aug 01, 2026 07:49 IST
కామన్వెల్త్ గేమ్స్: నీరజ్ చోప్రాకు రజతం
జావెలిన్ త్రో స్టార్ నీరాజ్ చోప్రాకు నిరాశ
85.83 మీటర్ల త్రో వేసి సిల్వర్ సాధించిన నీరజ్
భారత్కే చెందిన యశ్వీర్ సింగ్(85.41)కు కాంస్యం
శ్రీలంకకు చెందిన రమేశ్ పతిరగె(89.75)కు స్వర్ణం
-
Aug 01, 2026 07:47 IST
మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్ల ఎత్తివేత
ఎల్లంపల్లి ఇన్ఫ్లో 48వేలు, ఔట్ఫ్లో 24వేల క్యూసెక్కులు
ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20.175 TMCలు, ప్రస్తుతం 19.536 TMCలు
-
Aug 01, 2026 07:46 IST
ఢిల్లీ: నేటినుంచి ఇండియా పోస్ట్ లాస్ట్ మైల్ సేవలు
బల్క్ బుకింగ్ ధరల్ని ప్రకటించిన కేంద్రం
కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చిన పోస్టాఫీస్
-
Aug 01, 2026 07:46 IST
ఢిల్లీ: అమెరికా నుంచి 4,800 మంది భారతీయులు రిటర్న్
ఈ ఏడాది ఇప్పటివరకు 1,278 మంది బహిష్కరణ: కేంద్రం
-
Aug 01, 2026 07:45 IST
భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్ర రూపం
55.10 అడుగులకు గోదావరి వరద ఉధృతి
భద్రాచలం దగ్గర 15,40,412 క్యూసెక్కుల ప్రవాహం
భద్రాద్రిలో కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
-
Aug 01, 2026 07:45 IST
రాజమండ్రి: ధవళేశ్వరం దగ్గర గోదావరి వరద ఉధృతి
ఒకటో ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవాహం
ధవళేశ్వరంలో 10.60 అడుగుల ప్రవాహం
బ్యారేజ్ నుంచి 8.65 లక్షల క్యూసెక్కులు వరద విడుదల
-
Aug 01, 2026 07:45 IST
నేడు భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
రూ.17,912 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న మోదీ
రూ.4,727 కోట్లతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం
విశాఖ తర్లువాడలో ASIP సెమీకండక్టర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
సెమీకండక్టర్ ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్ తొలిదశకు శ్రీకారం
రూ.468 కోట్ల వ్యయంతో ASIP సెమీకండక్టర్ ప్రాజెక్టు నిర్మాణం
కర్నూలు జిల్లాలో 4 రెన్యువబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
రూ.5,550 కోట్ల వ్యయంతో పవర్గ్రిడ్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు
కర్నూలు విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ప్రారంభం
-
Aug 01, 2026 07:44 IST
విజయనగరం: భోగాపురం విమానాశ్రయానికి ఎయిరిండియా ప్లయింగ్ షెడ్యూల్
ఈ నెల 17 నుంచి 24 అక్టోబర్ వరకు ఎయిరిండియా ప్లయిట్ షెడ్యూల్
హైదరాబాద్-భోగాపురం మధ్య రోజూ 5 సర్వీసులు నడపనున్న ఎయిరిండియా
బెంగళూరు-భోగాపురం మధ్య రోజూ రెండు సర్వీసులు నడపనున్న ఎయిరిండియా
ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు.. బెంగళూరు-భోగాపురం మధ్య మరో సర్వీస్
విజయవాడ-భోగాపురం మధ్య రోజూ 4 సర్వీసులు