-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 14th June 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 14 , 2026 | 07:19 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jun 14, 2026 08:30 IST
నేడు హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన
నిరసనకు అనుమతి ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు
ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ వద్ద నిరసన
నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యా వ్యవస్థలో అవకతవకలకు నిరసన
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
ఇటీవల ఢిల్లీలో ఆందోళన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ
-
Jun 14, 2026 07:47 IST
కర్నూలు: ఆలూరు నియోజకవర్గంలో పలుచోట్ల భారీ వర్షం
పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
-
Jun 14, 2026 07:24 IST
ఇరాన్తో శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
నేడు ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం: ట్రూత్లో ట్రంప్ పోస్ట్
ఒప్పందం కుదిరిన వెంటనే హోర్ముజ్ జలసంధిని తెరుస్తాం: ట్రంప్
పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతే మా లక్ష్యం: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ దగ్గర ఇక అణ్వాయుధం ఉండదు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఒప్పందం విఫలమైతే ప్రత్యామ్నాయ చర్యలు: డొనాల్డ్ ట్రంప్
-
Jun 14, 2026 07:23 IST
అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇకపై 18 ఏళ్లు దాటిన వారికి ఆధార్ జారీపై నిషేధం
చొరబాటుదారులు ఆధార్ పొందకుండా నిరోధించేందుకు నిర్ణయం
-
Jun 14, 2026 07:22 IST
నేడు సింగపూర్కు ఏపీ సీఎం చంద్రబాబు
వరల్డ్ సిటీస్ ఫోరం సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు
అమరావతి, పట్టణ ప్రణాళిక, పెట్టుబడులపై చర్చలు
సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, పెట్టుబడిదారులతో సమావేశాలు
-
Jun 14, 2026 07:22 IST
కాకినాడ: తుని చిన్నారి కోసం కొనసాగుతున్న గాలింపు
ఎనిమిదిరోజులుగా గాలిస్తున్నా దొరకని బాలిక ఆచూకీ
తుని బాలిక అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా
కాకినాడ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన పవన్ కల్యాణ్
గాలింపు చర్యలకు NDRFను వినియోగించుకోవాలని సూచన
-
Jun 14, 2026 07:21 IST
నేటి నుంచి పాపికొండలు విహారయాత్రల నిలిపివేత
గండిపోచమ్మ దగ్గర బోట్లు నిలిపివేయాలని ఆర్డీవో సూచన
బోటు ఫిట్నెస్ నివేదికల తర్వాతే యాత్రలపై నిర్ణయం: ఆర్డీవో
-
Jun 14, 2026 07:19 IST
భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు
రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదు
అర్ధరాత్రి 2:26 గంటల సమయంలో కంపించిన భూమి
పాల్వంచ, బూర్గంపాడు, కొత్తగూడెం ప్రాంతాల్లో కంపించిన భూమి
భూప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు