Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 12 , 2026 | 06:05 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 12, 2026 08:00 IST

    ఏలూరు: చింతలపూడి మండలం లింగగూడెం దగ్గర గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ప్రమాదం

    • ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

    • ఒకరి మృతి, 15 మందికి గాయాలు

    • హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తుండగా ఘటన

    • క్షతగాత్రులను చింతలపూడి ఆస్పత్రికి తరలింపు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Sep 12, 2026 07:55 IST

    తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అరుదైన ఖనిజాల అన్వేషణ

    • 209.62 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశోధనకు గ్రీన్‌సిగ్నల్

    • ఖనిజాల అన్వేషణకు కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు ప్రభుత్వం అనుమతి

  • Sep 12, 2026 07:45 IST

    విజయవాడ: శనివారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం

    • ఒక్కసారిగా మారిన విజయవాడ వాతావరణం

    • ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం

    • ఈదురుగాలులతో నగరాన్ని ముంచెత్తిన వాన

    • భారీ వర్షంతో రోడ్లపైకి చేరుతున్న వర్షపు నీరు

  • Sep 12, 2026 07:30 IST

    తిరుపతి: 14న స్విమ్స్ OP, OTలకు సెలవు

    • ​వినాయక చవితి సందర్భంగా సేవలకు సెలవు: డైరెక్టర్ గుడారు జగదీష్

    • ​అత్యవసర సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి: డైరెక్టర్ గుడారు జగదీష్

    • మరుసటి రోజు నుంచి మిగిలిన సేవలు పునఃప్రారంభం: డైరెక్టర్ గుడారు జగదీష్

  • Sep 12, 2026 07:15 IST

    తిరుపతి: వెంకటగిరి సీఐ, ఎస్సై సహా పలువురు పోలీసులపై కేసు నమోదు

    • జూనియర్ సివిల్ కోర్టు ఆదేశాలతో ప్రైవేటు కేసు నమోదు

    • ​పోలీసులు తమను ఇబ్బంది పెట్టారంటూ కోర్టులో ఫిర్యాదు చేసిన ఐఐహెచ్‌టీ ఉద్యోగి

    • ​సీఐ రోశయ్య, ఎస్సై స్వరూప, ఏఎస్సై రమణయ్యపై కేసు నమోదైనట్లు స్పష్టం చేసిన డీఎస్పీ చెంచుబాబు

  • Sep 12, 2026 07:00 IST

    తిరుపతి: శ్రీకాళహస్తి వద్ద భారీగా ఎర్రచందనం దుంగల స్వాధీనం

    • మేలచ్చూరు సమీపంలో అక్రమంగా దాచిన 400 కిలోల 40 దుంగల స్వాధీనం

    • ఎర్రచందనం దుంగల విలువ రూ. 2 లక్షలు: ఎఫ్ఆర్ఓ లోకేశ్

    • ఎర్రచందనం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన అధికారులు

  • Sep 12, 2026 06:55 IST

    గుంటూరు జిల్లా: పొన్నూరు పట్టణంలో దారుణం

    • 8వ వార్డు క్యాబిన్ పేటకు చెందిన ఈవూరు లక్ష్మి(45) హత్య

    • ప్రియుడితో కలిసి తల్లిని కూతురే హత్య చేసినట్లు బంధువుల ఆరోపణలు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పొన్నూరు అర్బన్ పోలీసులు

  • Sep 12, 2026 06:45 IST

    కర్నూలు: ఆస్పరి మండలం కైరుప్పలలో విషాదం

    • అప్పుల బాధతో వెంకట రాముడు (35) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Sep 12, 2026 06:40 IST

    కర్నూలు: నగర శివారులోని జగన్నాధగట్టుపై అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు

    • అడ్డుకున్న టిడ్కో ఇళ్ల నివాసితులు, దాడి చేసిన మట్టి మాఫియా

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

  • Sep 12, 2026 06:35 IST

    గుజరాత్ తీరంలో రెండు వాణిజ్య నౌకల ఢీ

    • రంగంలోకి ఇండియన్ కోస్ట్‌గార్డ్‌

    • 21 మందిని రక్షించిన కోస్ట్‌గార్డ్‌

    • కాండ్లా ఎయిర్‌పోర్ట్‌ దగ్గర ఘటన

  • Sep 12, 2026 06:33 IST

    నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

    • మహాగణపతి దర్శనానికి వచ్చే వాహనాల మళ్లింపు

    • ఈ నెల 24 వరకూ కొనసాగనున్న ఆంక్షలు

  • Sep 12, 2026 06:30 IST

    నేడు, రేపు TPCC ఎస్సీ సెల్ ధర్నా

    • కవ్వంపల్లి ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో కార్యక్రమం

    • అంటరానితనానికి వ్యతిరేకంగా TPCC ధర్నా

  • Sep 12, 2026 06:25 IST

    ఏపీపై కొనసాగుతున్న అల్పపీడనం

    • నేడు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

    • శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన

    • నేడు తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

  • Sep 12, 2026 06:20 IST

    నేడు విజయవాడలో ఐద్వా రాష్ట్ర మహాసభలు

    • ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

  • Sep 12, 2026 06:15 IST

    విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం

    • నేడు సిట్ సమక్షంలో సాయికృష్ణ తల్లి బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరణ

  • Sep 12, 2026 06:10 IST

    నేడు తెలంగాణ భవన్‌లో BRS మాక్‌ అసెంబ్లీ

    • అసెంబ్లీ సెషన్‌ నుంచి BRS ఎమ్మెల్యేలు, MLCలను సస్పెండ్‌ చేయడంతో మాక్ అసెంబ్లీ

    • స్పీకర్‌గా వ్యవహరించనున్న మాణిక్యరావు

    • సీఎం పాత్రలో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

  • Sep 12, 2026 06:05 IST

    నేడు ఏపీలో నేడు ఆరోగ్య ప్రాజెక్టుల ప్రారంభం

    • ఏపీలో రూ.249.50 కోట్లతో 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులు

    • ప్రారంభించనున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు

    • 10 ఎమర్జెన్సీ కేంద్రాలు, 12 ప్రజారోగ్య ప్రయోగశాలలు

  • Sep 12, 2026 06:00 IST

    నేటినుంచి ఢిల్లీలో బ్రిక్స్ సమ్మిట్‌

    • రెండు రోజులు జరగనున్న బ్రిక్స్‌ సదస్సు

    • సదస్సుకు రానున్న 11 దేశాధినేతలు