Share News

40 ఏళ్లు దాటాయా? శరీరానికి మద్దతు ఇచ్చే సప్లిమెంట్లు ఇవే.!

ABN , Publish Date - Feb 06 , 2026 | 02:29 PM

40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో సహజంగా మార్పులు మొదలవుతాయి. శక్తి తగ్గడం, ఎముకల బలహీనత వంటి సమస్యలు కనిపించవచ్చు. అయితే, డాక్టర్లు సూచించే సప్లిమెంట్లతో ఈ వయస్సులోనూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు.

40 ఏళ్లు దాటాయా? శరీరానికి మద్దతు ఇచ్చే సప్లిమెంట్లు ఇవే.!
40 Plus Health Tips

ఇంటర్నెట్ డెస్క్: 40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఈ దశలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, అవసరమైన పోషకాలను అందించడం చాలా ముఖ్యం. సరైన ఆహారం తీసుకుంటే శక్తి స్థాయిలు మెరుగుపడతాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మరింత చురుకుగా, ఉత్సాహంగా ఉండవచ్చు. నేటి బిజీ జీవితంలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ 40 ఏళ్ల తర్వాత తీసుకునే ఆహారం భవిష్యత్తులో మీ జీవన నాణ్యతను నిర్ణయిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, 70 ఏళ్ల తర్వాతా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.


ఆరోగ్యకరమైన ఆహారం బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని వల్ల గుండె జబ్బులు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు, ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, శక్తిని పెంచుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, 40 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సప్లిమెంట్ల గురించి తెలుసుకుందాం..


విటమిన్ B12

వయసు పెరిగే కొద్దీ B12 విటమిన్ శోషణ తగ్గుతుంది. ఈ విటమిన్ లోపం ఉంటే అలసట, నరాల సమస్యలు వస్తాయి. అందువల్ల నరాల ఆరోగ్యం, రక్త కణాల ఉత్పత్తి, శక్తి కోసం విటమిన్ B12 సప్లిమెంట్లు అవసరం.

ఒమేగా-3

ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది. గుండె, మెదడు, కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. మేధస్సు పనితీరును కాపాడుతుంది.

క్యాల్షియం

40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఎముకలు బలహీనపడే అవకాశం ఉంటుంది. క్యాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. విటమిన్ డితో కలిసి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

విటమిన్ D3

క్యాల్షియం శోషణకు ఇది అవసరం. కండరాలు, ఎముకలు, రోగనిరోధకశక్తిని బలంగా ఉంచుతుంది.


పొటాషియం

గుండె, కండరాలు సరిగ్గా పనిచేయడానికి ఇది అవసరం. నరాల సంకేతాలకూ సహాయపడుతుంది.

జింక్

వయసుతోపాటు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. శరీరాన్ని జింక్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది, త్వరగా మానడానికి సహాయపడుతుంది.

మెగ్నీషియం

రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.


సెలీనియం

ఇది యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. థైరాయిడ్ పనితీరుకు, రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది.

40 ఏళ్లు దాటడం అంటే శక్తి తగ్గిపోవడం కాదు. ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఇది. సరైన ఆహారం, అవసరమైన పోషకాలు తీసుకుంటే వృద్ధాప్యాన్ని కూడా ఆరోగ్యంగా, ఆనందంగా గడపవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!

అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!

For More Latest News

Updated Date - Feb 06 , 2026 | 04:16 PM