చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగితే యమ డేంజర్
ABN , Publish Date - May 02 , 2026 | 02:14 PM
చిప్స్ తింటూ కూల్ డ్రింక్ తాగే అలవాటు మీకు ఉందా? అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో చాలా మంది చల్లని పానీయాలు తాగడానికి ఇష్టపడతారు. ఇవి చాలా రుచిగా ఉండటంతో పాటు వెంటనే చల్లదనం కూడా ఇస్తాయి. కొందరు ఈ పానీయాలతో పాటు చిప్స్ కూడా తింటారు. అయితే, ఇది సాధారణంగా కనిపించే అలవాటు అయినప్పటికీ, ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాత్కాలికంగా..
చల్లని పానీయాలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కొన్నింటిలో కెఫీన్ కూడా ఉంటుంది. ఇవి తాగినప్పుడు తాత్కాలికంగా దాహం తగ్గినట్లు అనిపించినా, వాస్తవానికి శరీరంలో నీరు తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల నీరసం, తల తిరగడం, అలసట వంటి సమస్యలు రావచ్చు. వేసవిలో శరీరానికి తగినంత నీరు అవసరం కాబట్టి ఇది మరింత ప్రమాదకరం.
దీర్ఘకాలంలో వ్యాధుల ప్రమాదం
ఇక చిప్స్ విషయానికి వస్తే, వాటిలో ఉప్పు, హానికరమైన కొవ్వులు (ట్రాన్స్ ఫ్యాట్స్) ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నీటిని తగ్గించడమే కాకుండా, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కూడా దెబ్బతీస్తాయి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల దాహం మరింత పెరుగుతుంది. దాంతో మళ్లీ మళ్లీ చల్లని పానీయాలు తాగే అలవాటు పెరుగుతుంది. ఈ రెండు కలిపి తరచుగా తీసుకుంటే, దీర్ఘకాలంలో బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, యువతలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
చిప్స్కు బదులుగా..
అందుకే ఈ అలవాటును తగ్గించడం మంచిది. చల్లని పానీయాల బదులుగా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి సహజ పానీయాలు తాగడం మంచిది. ఇవి శరీరానికి తేమను అందించి, ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చిప్స్కు బదులుగా వేయించిన మఖానా, వేరుశెనగలు లేదా తాజా పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News