Share News

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాలు ఎప్పుడంటే?

ABN , Publish Date - Apr 24 , 2026 | 10:32 AM

ఆంధ్రప్రదేశ్‍లో పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు కాలేజీలకు వెళ్తామా అని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికో గుడ్ న్యూస్.

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాలు ఎప్పుడంటే?
AP SSC Results 2026

అమరావతి: ఆంధ్రప్రదేశ్‍లో పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు కాలేజీలకు వెళ్తామా అని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికో గుడ్ న్యూస్. పదో తరగతి ఫలితాలను ఎస్ఎస్‌సీ బోర్డు(BSEAP) ఈనెల 25న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎస్ఎస్‌సీ బోర్డు తమ అధికారిక వెబ్‌సైట్ results.bse.ap.gov.inలో వీటిని విడుదల చేయనుంది.


ఫలితాలు విడుదలైన తర్వాత మార్కుల మెమోను results.bse.ap.gov.in లేదా bse.ap.gov.in అధికారిక వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఫలితాల తనిఖీ సమయంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హాల్ టికెట్ నంబర్లను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. 2025 ఏపీ ఎస్‌ఎస్‌సీ ఫలితాలు ఏప్రిల్ 23, 2025న విడుదలయ్యాయి. దీంతో ఈ ఏడాది కూడా దాదాపు ఇదే వారంలో ఫలితాలు రిలీజ్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాగా, పదో తరగతి పరీక్షలను మార్చి 16 నుంచి 1 ఏప్రిల్ 2026 వరకు అధికారులు నిర్వహించారు.


ఫలితాలు ఎలా చూడాలి..?

స్టెప్-1: అధికారిక సైట్లు bse.ap.gov.in లేదా results.bse.ap.gov.inని సందర్శించండి.

స్టెప్-2: ల్యాండింగ్ పేజీలో AP SSC Results 2026 అనే లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్-3: హాల్ టికెట్ నంబర్ లేదా రోల్ నంబర్‌ను నమోదు చేయండి.

స్టెప్-4: సమర్పించు(సబ్మిట్) బటన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్-5: BSEAP 10, 12వ తరగతి ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. పదో తరగతిపై క్లిక్ చేసి ఫలితాలు చూసుకోండి.

స్టెప్-6: మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.


ఈ వార్తలు కూడా చదవండి

8 నుంచి ఏపీపీజీసెట్‌

ఏపీఈసెట్‌కు 96.16 శాతం హాజరు

Updated Date - Apr 24 , 2026 | 11:12 AM