నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారీ లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:46 AM
నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఓపెన్ అయ్యాయి. ఒక పక్క మధ్యప్రాశ్చంలో యుద్ధం తారాస్థాయిలో ఉన్నా భారత మార్కెట్లు ఇవాళ ముందుకు సాగుతున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో మార్కెట్ గ్రీన్ గా కనిపిస్తోంది.
ఆంధ్రజ్యోతి, మార్చి 20: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ అద్భుతమైన రికవరీని సాధించాయి. ఆరంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ 23,300 పాయింట్ల మార్కును దాటి దూసుకుపోయాయి.
గత కొన్ని రోజులుగా పడుతున్న మార్కెట్లలో షేర్లు తక్కువ ధరకే లభిస్తుండటంతో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs), రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు చేపట్టారు. మరోవైపు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై సానుకూల సంకేతాలు ఇవ్వడం ప్రపంచ మార్కెట్లకు బలాన్ని ఇచ్చింది. ఇది భారత మార్కెట్లలో కూడా ఉత్సాహాన్ని నింపింది.
ఈ రోజు ట్రేడింగ్లో బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ రంగాలు అగ్రగామిగా నిలిచాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ వంటి బ్లూ-చిప్ షేర్లు మార్కెట్ను ముందుకు నడిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News