Gold and Silver Rates today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jan 07 , 2026 | 06:35 AM
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 7న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు బుధవారం కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices). డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 7న) ఉదయం 6:30 గంటల సమయంలో హైదరాబాద్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 38, 830కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 27, 260కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1, 38, 980కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1, 27, 410కి చేరుకుంది. మరోవైపు వెండి కూడా జోరు చూపిస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలోకు వంద రూపాయల మేర పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్లో రూ. 1, 38, 830, రూ. 1, 27, 260
విజయవాడలో రూ. 1, 38, 830, రూ. 1, 27, 260
ఢిల్లీలో రూ. 1, 38, 980, రూ. 1, 27, 410
ముంబైలో రూ. 1, 38, 830, రూ. 1, 27, 260
వడోదరలో రూ. 1, 38, 880, రూ. 1, 27, 310
కోల్కతాలో రూ. 1, 38, 830, రూ. 1, 27, 260
చెన్నైలో రూ. 1, 38, 830, రూ. 1, 27, 260
బెంగళూరులో రూ. 1, 38, 830, రూ. 1, 27, 260
కేరళలో రూ. 1, 38, 830, రూ. 1, 27, 260
పుణెలో రూ. 1, 38, 830, రూ. 1, 27, 260
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్లో రూ. 2, 71, 100
విజయవాడలో రూ. 2, 71, 100
ఢిల్లీలో రూ. 2, 53, 100
చెన్నైలో రూ. 2, 71, 100
కోల్కతాలో రూ. 2, 53, 100
కేరళలో రూ. 2, 71, 100
ముంబైలో రూ. 2, 53, 100
బెంగళూరులో రూ. 2, 53, 100
వడోదరలో రూ. 2, 53, 100
అహ్మదాబాద్లో రూ. 2, 53, 100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
ఉత్తరప్రదేశ్లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
తొక్కిసలాట మరణాలపై విజయ్కు సీబీఐ సమన్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి