Share News

పశ్చిమ గోదావరి జిల్లా అయితంపూడి వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి గల్లంతు..

ABN , Publish Date - Aug 16 , 2026 | 07:04 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెరవలిలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.

పశ్చిమ గోదావరి జిల్లా అయితంపూడి వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి గల్లంతు..
West Godavari Car Accident

పశ్చిమ గోదావరి జిల్లా: ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెరవలిలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గల్లంతయ్యారు. అదే కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డాడు.


గత్లంతైన వారిని పోతుల లక్ష్మీభాను (18), రాజా రామ్ (17), నాగిరెడ్డి దుస్వంత (18), నాగాబత్తుల సాయి సూర్య (19)గా, అలాగే ప్రమాదం నుంచి బయటపడిన యువకుడిని మట్టా సంతోశ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాలువలోకి కారు దూసుకెళ్లడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

భోగాపురానికి 20 ఎలక్ట్రిక్‌ బస్సులు

జాతీయ జెండా సాక్షిగా ఏపీని నంబర్‌ 1 చేస్తాం

Updated Date - Aug 16 , 2026 | 07:35 AM