తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు
ABN , Publish Date - May 25 , 2026 | 04:43 PM
తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందంటూ పశ్చిమగోదావరి జిల్లా ఉన్నతాధికారులను ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆశ్రయించారు.
భీమవరం, మే 25: తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందంటూ పశ్చిమగోదావరి జిల్లా ఉన్నతాధికారులను ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆశ్రయించారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య కేంద్రం భీమవరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో అనంత శ్రీరామ్ ఈ ఫిర్యాదు చేశారు. పాలకొల్లు సమీపంలోని యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తమ ఇంటి ముందున్న ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారంటూ ఆయన తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ స్థల వివాదం ప్రస్తుతం కోర్టులో ఉందని గుర్తు చేశారు.
ఈ స్థలం కోసం మాజీ ఎంపీ హరి రామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ తన తల్లిదండ్రులను బెదిరింపులకు గురి చేస్తూ.. వారిని మానసికంగా హింసకు గురి చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని జిల్లా కలెక్టర్తోపాటు ఎస్పీకి అనంత శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. వారికి రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను అనంత శ్రీరామ్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ మెట్రోకు భారీ ఆర్థిక రుణం.. ఐఆర్ఎఫ్సీతో కీలక ఒప్పందం
వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..
Read Latest AP News And Telugu News