Share News

విశాఖ జూలోకి కొత్త జంతువులు.. పవన్ కల్యాణ్ ట్వీట్

ABN , Publish Date - Sep 05 , 2026 | 09:33 PM

ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు కొత్త జంతువులు వచ్చాయి. జామ్‌నగర్‌లోని రాధేకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్‌తో జరిగిన జంతు మార్పిడి కార్యక్రమం విజయవంతమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’లో తెలిపారు.

విశాఖ జూలోకి కొత్త జంతువులు.. పవన్ కల్యాణ్ ట్వీట్
Pawan Kalyan

విశాఖపట్నం: ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల (IGZP)కు కొత్త జంతువులు వచ్చాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రాధేకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్‌తో జంతు మార్పిడి కార్యక్రమాన్ని ఐజీజెడ్పీ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ జంతు మార్పిడిలో భాగంగా ఐజీజెడ్పీకి 3 జీబ్రాలు, 4 కాటన్-టాప్ టామరిన్‌లు, 3 రెడ్-నెక్డ్ వాలబీలు, 2 కామన్ మార్మోసెట్‌లు వచ్చాయి. ముఖ్యంగా అంతరించిపోతున్న కాటన్-టాప్ టామరిన్‌లను ఐజీజెడ్పీలో తొలిసారిగా ప్రవేశపెట్టారు.


మరోవైపు ఐజీజెడ్పీ నుంచి 3 ఇండియన్ గౌర్‌లు, 4 స్టంప్-టెయిల్డ్ మకాక్‌లు, 2 ఘరియాల్‌లను జామ్‌నగర్‌కు తరలించారు. కొత్తగా వచ్చిన అన్ని జంతువులు ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సెంట్రల్ జూ అథారిటీ (CZA) నిబంధనల ప్రకారం వాటిని తప్పనిసరి పశువైద్య క్వారంటైన్‌లో ఉంచారు. ఈ జంతు మార్పిడి కార్యక్రమం ఐజీజెడ్పీలో జంతువుల సంరక్షణ, సంతానోత్పత్తి కార్యక్రమాలకు మరింత బలం చేకూర్చనుంది. అలాగే వన్యప్రాణులపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు సందర్శకులకు మరింత మంచి అనుభూతిని అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పవన్ కల్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు.


Also Read:

గుంటూరులో బాలిక మిస్సింగ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు జారీ

Updated Date - Sep 05 , 2026 | 09:33 PM