'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' అమలుకు పటిష్ఠ చర్యలు: మంత్రి సత్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:50 PM
ఏపీలో 'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆర్థిక స్థోమత లేకపోయినా, వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికీ వైద్యం అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.
విజయవాడ, జూన్ 24: ఏపీలో 'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆర్థిక స్థోమత లేకపోయినా, వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికీ వైద్యం అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. అరుదైన వ్యాధులను ముందే గుర్తించేందుకు రాష్ట్రంలో 'యూనివర్సల్ నియోనాటల్ స్క్రీనింగ్' ప్రారంభించినట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యం, పరిశోధనల కోసం ఏపీలో మూడు 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' కేంద్రాలను గుర్తించామని.. విశాఖ (AMC), విజయవాడ (SMC), తిరుపతిలో 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పరిశోధనల కోసం PSU, CSR నిధుల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని డీఎమ్ఈ(DME) అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర జాబితాలో లేని 'హంటింగ్టన్స్ వ్యాధి'పై కూడా ప్రభుత్వం ముందస్తు (Proactive) చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. పాలసీ అమలులో కేరళ వంటి రాష్ట్రాల ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. బాధితుల ఆర్థిక భరోసా కోసం ప్రత్యేక నిధుల ఏర్పాటు అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఒకప్పుడు KGF.. ఇప్పుడు JGF: సీఎం చంద్రబాబు
కాపులను వైసీపీ వినియోగించుకుంది... గౌరవించలేదు: సోమువీర్రాజు
Read Latest AP News And Telugu News